వరి ధాన్యం అక్రమ రవాణ అరికట్టాలి

Illegal shipment of rice should be stoppedనవతెలంగాణ – వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం చేరకూరు గ్రామంలో గల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బి.రాంపతి, వాజేడు మండలం తాసిల్దార్ డివిబి ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో రెవెన్యూ వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖల నుండి నియమించబడిన సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరి దాన్యం కు సంబంధించిన వాహనాలను నిరంతరం తనిఖీ చేయాలని, సరైన పత్రాలు ఉంటేనే అనుమతించాలని, లేనిచో అట్టి వాహనాలను సీజ్ చేసి వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే CMR బియ్యము  పిడిఎస్ బియ్యం వాహనాలను తనిఖీ చేసి వెంటనే జప్తు చేయాలనీ  ఆదేశించారు. పిడిఎస్ బియ్యం రాక పోకల వాహనాలను వెంటనే సీజ్ చేయాలనీ ఆదేశించారు. అదేవిధంగా చెక్ పోస్ట్ లో వాహనాలు రాకపోకల సమాచారాన్ని ఒక రిజిస్టర్లో నమోదు చేసి జిల్లా పౌరసరఫరాల అధికారికి నిరంతరం సమాచారం ఇవ్వవలసిందిగా ఆదేశించారు.