ఇంటి గోడ విషయంలో దాడి..వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా

నవతెలంగాణ-చందుర్తి : ఇంటి గోడ విషయంలో దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష,2000/- రూపాయల జరిమాన విధిస్తూ న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు చందుర్తి సి.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ గారు మాట్లాడుతూ…..చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ గట్టు వసంత, భర్త మల్లేశం అనే మహిళ అదే గ్రామానికి చెందిన గల బొజ్జ  గట్టు మోహన్ కు ఇంటి ప్రక్కన ఉన్న భూమి విషయంలో గొడవలు జరుగగా తేదీ 16.8.2014 రోజున వసంత ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా మోహన్ గోడ నిర్మిస్తుండగా అడ్డుకున్న వసంతని బూతులు తిట్టి కొట్టగా వసంత కుడి వేలు విరుగగా వసంత చందుర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరువున పి.పి విక్రాంత్ వాదించగా  ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్ట్ కానిస్టేబుల్ తిరుపతి , కానిస్టేబుల్ మధుసూదన్ కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టగా కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరం రుజువు కావడంతో నిందితుడు బొజ్జ గట్టు మోహన్ రెండు సంవత్సరాల జైలు శిక్ష ,రెండు వెయిల రూపాయలు జరిమానా విధించినట్లు చందుర్తి సి.ఐ తెలిపారు.