
– మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి..
నవతెలంగాణ -డిచ్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరిట రైతులను నట్టేట ముంచుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మిల్లర్లు శాసించే స్థాయికి చేరుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముక్కు పిండి మిల్లర్ల దగ్గర వసూల్ చేసి నయాపైసా చొప్పున నష్టపోయిన రైతులకు చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంఛార్జి డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో వడ్ల రాజు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకొని మృతుని భార్య వరలక్ష్మీకి 5000 వేల ఆర్థిక సహాయం అందించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అదే గ్రామంలో దేవి శంకర్ అత్తమ్మ బాకరం నర్సవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మల్లాపూర్ గ్రామంలో విలేకరులతో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడారు. ప్రతి పంటకు ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయలు మిల్లర్ల దగ్గర వసూల్ చేస్తున్నారని అందులో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వాటా ఎంత అని ప్రశ్నించారు. తరుగు పేరిట రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికీ దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముక్కు పిండి మిల్లర్ల దగ్గర వసూల్ చేసి నయాపైసా చొప్పున నష్టపోయిన రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, జంగిలి లక్ష్మీ, గోపాల్, కుమ్మరి గంగాధర్, కర్సమోహన్, ప్రకాష్ ,నారాయణ, తులం నర్సయ్య, కొలిమికాడి గంగాధర్, లక్ష్మణ్ గౌడ్, ధర్మారం రాజేందర్, కంచెటి గంగాధర్, మూడేళ్ల లింబాద్రి, రేపల్లె భూమన్న, దేవి శంకర్, రాజన్న, ఆశిష్, శ్రీరామ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరిట రైతులను నట్టేట ముంచుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మిల్లర్లు శాసించే స్థాయికి చేరుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముక్కు పిండి మిల్లర్ల దగ్గర వసూల్ చేసి నయాపైసా చొప్పున నష్టపోయిన రైతులకు చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంఛార్జి డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో వడ్ల రాజు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకొని మృతుని భార్య వరలక్ష్మీకి 5000 వేల ఆర్థిక సహాయం అందించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అదే గ్రామంలో దేవి శంకర్ అత్తమ్మ బాకరం నర్సవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మల్లాపూర్ గ్రామంలో విలేకరులతో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడారు. ప్రతి పంటకు ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయలు మిల్లర్ల దగ్గర వసూల్ చేస్తున్నారని అందులో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వాటా ఎంత అని ప్రశ్నించారు. తరుగు పేరిట రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికీ దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముక్కు పిండి మిల్లర్ల దగ్గర వసూల్ చేసి నయాపైసా చొప్పున నష్టపోయిన రైతులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, జంగిలి లక్ష్మీ, గోపాల్, కుమ్మరి గంగాధర్, కర్సమోహన్, ప్రకాష్ ,నారాయణ, తులం నర్సయ్య, కొలిమికాడి గంగాధర్, లక్ష్మణ్ గౌడ్, ధర్మారం రాజేందర్, కంచెటి గంగాధర్, మూడేళ్ల లింబాద్రి, రేపల్లె భూమన్న, దేవి శంకర్, రాజన్న, ఆశిష్, శ్రీరామ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.