అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ

Inauguration of All India National OBC Mahasabha Wall Magazineనవతెలంగాణ – కంటేశ్వర్ 
ఆగస్టు 7న అమృత్సర్లో జరిగే అఖిలభారత జాతీయ ఓబిసి మహాసభ గోడ పత్రికను శుక్రవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల ఆవరణంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు.మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహ సభలను నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆగస్టు 7 న పంజాబ్ లోని అమృత్సర్  నగరంలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 9వ మహాసభ నిర్వహించునున్నారు. ఈ మేరకు  నగరంలోని డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్  నుండి పెద్ద ఎత్తున బీసీలు మహాసభకు  తరలి రావాలని జిల్లా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మహాసభలో బీసీలకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగాలలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల బీసీల స్థితిగతులపైన చర్చించడం జరుగుతుందని, అదేవిధంగా భవిష్యత్తులో అన్ని  రాష్ట్రాలలో జరగబోయేటువంటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60% టికెట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.  బీసీలందరు రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు ఆకుల ప్రసాద్, కరిపే రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, కోడూరు స్వామి, బసవ రాజు, నర్సయ్య, అనిల్ పవార్, మురళి, గణేశ్,  తదితరులు పాల్గొన్నారు.