బీఆర్ఎస్ లో ముదిరాజ్, ఒడ్డెర కులస్తుల చేరిక

నవతెలంగాణ-వీణవంక: మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన ముదిరాజ్, ఒడ్డెర కులస్తులు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.