– ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంపు కార్యాలయం ముందు భూ బాధితులతో కాంగ్రెస్ ధర్నా
నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట అర్బన్ మండలం మిట్ట పల్లి గ్రామంలోని రైల్వే బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంద ని, కమీషన్ల కోసం రోడ్డు వెడల్పు పెంచడం దారుణమని టీపీసీసీ సభ్యు డు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జి బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ విషయాన్ని అత్తు ఇమామ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే భూబాధితులకు న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. గతంలో చేసిన సర్వే ఆధారంగా బ్రిడ్జి నిర్మించాలని, కొత్తగా నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటామని అన్నారు. ఈ విషయాన్ని త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డిసిసి మహిళా అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మి, డిసిసి మైనార్టీ అధ్యక్షుడు మజర్ మాలిక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మధు, పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్, ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాశద్, అయుబ్, నవాజ్ పాల్గొన్నారు.