
భిక్కనూర్ పట్టణంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు స్వాతంత్ర సమరయోధులు, భారతమాత, ఇండియన్ ఆర్మీ జవానుల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.