తొర్లికొండలో ఘనంగా 76వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
మండలంలోని  తొర్లికొండ ప్రాథమిక  పాఠశాల లో మంగళవారం  76వ  స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ  సందర్బంగా  గ్రామంలో  విద్యార్థులతో  ప్రభాత్ భేరినిర్వహించడం  జరిగింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు  జంగం అశోక్  త్రివర్ణ పతకం  ఎగురావేశారు.స్థానిక  గ్రామ అభివృద్ధి కమిటీ  2500/రూపాయలు సమాకూర్చారు. ఆట పోటీలలో  గెలుపొందిన  విద్యార్థులకు  బహుమతులు  అందజేశారు.  ఈ కార్యక్రమం లో  సర్పంచ్  సురేష్, ఎంపీటీసీ  పద్మ, ఉపసర్పంచ్  భూమేశ్వర్, వీడీసీ చైర్మన్  జీవన్, కోశాధికారి  జానకిరామ్, పీ ఎ సీ యస్  చైర్మన్  అన్వేష్ రెడ్డి.  హెచ్ ఎం.  జంగం అశోక్. టీచర్స్. గ్రామస్తులు పాల్గొన్నారు.