బడ్జెట్లో అంగన్వాడి లకు అన్యాయం: సురేష్ గొండ

Injustice to Anganwadis in the budget: Suresh Gondaనవతెలంగాణ – మద్నూర్
కేంద్ర బడ్జెట్లో ఐసిడిఎస్ అంగన్వాడీలకు నిధులు తగ్గించి అన్యాయం చేశారని. అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ గొండ ఒక ప్రకటనలో ఆరోపించారు. గత బడ్జెట్లో 2023. 2024. బడ్జెట్లో ఇరవై ఒక్క వేల. 523 కోట్లు కేటాయించగా ప్రస్తుత 2024 2025. బడ్జెట్లో. 21 వేల 200 వందల కోట్లు  కేటాయించింది. అంటే 323 కోట్లు తగ్గించినట్లు బడ్జెట్లో చూపించారు. ప్రస్తుతం అన్ని రకాల వస్తువుల ధరలు  పెరిగినాయి. ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు  ఎలా పెంచుతారు అని సురేష్ కొండ  ప్రశ్నించారు. గతంలో బడ్జెట్ తగ్గించారు తగ్గింపు పట్ల సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 1500 పెంచుతామని రెండుసార్లు ప్రకటించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసం చేసింది. ఈ బడ్జెట్లో అంగన్వాడీల జీతాలు  ఎంత పెంచుతున్నారో చెప్పలేదు.  బడ్జెట్లో మన వాటా కోసం పోరాటం చేయాలి. ఐసిడిఎస్. వాటా కోసం. కేంద్ర. రాష్ట్ర కమిటీలు ఏ పోరాటానికి.పిలుపునిచ్చిన. కామారెడ్డి జిల్లాలోని. ఐదు ఐసిడిఎస్ అంగన్వాడి ప్రాజెక్ట్. లోని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్. సిద్ధంగా ఉండాలని అంగన్వాడీల యూనియన్ గౌరవ అధ్యక్షులు సురేష్ గొండ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.