బడ్జెట్లో విద్యారంగానికి మొండి చెయ్యి 

నవతెలంగాణ కంఠేశ్వర్
కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ విద్యారంగానికి తీవ్ర మొండి చెయ్యి చూపించిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్  తెలియజేశారు.  గత ఓటాన్ బడ్జెట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు , ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు కేవలం 0.1 మాత్రమే బడ్జెట్ ను పెంచారు. బడ్జెట్ మొత్తంలో పెరిగినట్లు ఉన్న గతం కంటే విద్యారంగానికి బడ్జెట్ తగ్గింది. గత మొత్తం బడ్జెట్ 45,03,638 కోట్ల నుండి 48,21,000 కోట్లకు పెరిగింది. అంటే 7 శాతం బడ్జెట్ పెరిగింది. కానీ విద్యారంగానికి తీవ్రంగా నిధులను తగ్గింపు చేశారు. గత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ లో విద్యారంగానికి 1,12,899(2.5%) కోట్లు బడ్జెట్ కేటయింపులు చేసిన కేంద్రంలో నాడు బడ్జెట్ లో ప్రతిపాదించిన డిజిటల్ గ్రంథాలయం నిధులు, జాతీయ విద్యా మిషన్ నిధులు, ఏకలవ్య పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ, 157 నర్సింగ్ కళాశాలలు,ఐటీఐ లకు బడ్జెట్ వంటి అంశాలను ప్రస్తావనే లేదు. గత నిధులు పూర్తిగా ఖర్చు చేయకుండా పేపర్ పైనే బడ్జెట్ ను చూపిస్తుంది. ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే యు జి సి కి భారీగా నిధులు కోతపెట్టారు.అలాగే  గత బడ్జెట్లో యు జి సి కి 5360 కోట్లు కేటాయించగా క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. 2023 లో యు జి సి కి 6409 కోట్లు రూపాయలు మాత్రమే యుజిసికి కేటాయించారు. కేంద్ర యూనివర్సిటీలకు గతం కంటే స్థూలంగా నిధులు పెంచారు. గత బడ్జెట్లో 14,903.87 కోట్లు  కేటాయింపులు చేస్తే ప్రస్తుతం 15,928 కోట్లు కేటాయించారు.
సెంట్రల్ యూనివర్సిటీ నూతన భవనాలు, ఫెలోషిప్ పెంపు, హాస్టల్స్ నిర్మాణం గురించి అభివృద్ధికి నిధుల ప్రస్తావన లేదు. ఐఐటీలను గత బడ్జెట్లో 9661.50 కోట్లు ఈ బడ్జెట్లో 10,324.50 కోట్లు కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ గురించి, పరిశోధనలకు ప్రత్యేక నిధులు కేటాయింపులు గురించి, ఈ బడ్జెట్ లో ప్రస్తావన తీసుకొని రాలేదు.ఎన్ఐటీలకు గత సంవత్సరం 4820.60 కేటాయిస్తే ఈ సంవత్సరం 5040 కోట్లు -ఐఐఎస్ ఆర్ గత సంవత్సరం 815.40కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 918.27 కోట్లు కేటాయించారు.- ఐఐఎస్ ఆర్  లకు  గత సంవత్సరం 1462 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 1540 కోట్లు కేటాయించారు. అంటే పరిశోధనలకు ప్రధాన కేంద్రాలైన ఈ విద్యా సంస్థలలో నిధులను అభివృద్ధికి మౌలిక సదుపాయాల కోసం కాకుండా వాటి నిర్వహణ కోసం మాత్రమే కేటాయిస్తుంది.
దేశంలో పాఠశాల విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఆసర్ రిపోర్ట్, ఆసోచామ్ రిపోర్టులు దేశంలో ఒక లక్ష టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సరైన మౌలిక సదుపాయాలు లేవని, టాయిలెట్స్, భవనాలు కనీసం కరెంట్ సౌకర్యం లేకుండా ఉన్నాయని నివేదికలు చెబుతుంటే, బడ్జెట్లో మాత్రం పాఠశాల విద్యకు గత బడ్జెట్లో 68,804.85 కేటాయిస్తే ఈ సంవత్సరం 71,50893 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు గత బడ్జెట్లో 44,094.62 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో 53,196.28.కోట్లు కేటాయించారు. బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో సమూల మార్పులు తెచ్చే, భవిష్యత్ మార్చే  నూతన విద్యావిధానం 2020, దాని ప్రతిపాదనలు ఈ దేశంలో అమలు చేయాలంటే కనీసం 6% నిధులు (4,82,100) కోట్ల నిధులు అవసరం అని చెబితే ప్రభుత్వం ప్రస్తుతం ఒక లక్ష కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి, విద్యా అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్య అభివృద్ధి కోసం చర్యలు తీసుకొని నిధులు కేటాయించాలని ఎస్.ఎఫ్.ఐ కోరుతుంది.