వాహనాల తనిఖీ

నవతెలంగాణ-ముత్తారం: ముత్తారం మండల కేంద్రంలోని కాసర్లగడ్డ వద్ద ఎస్ఐ ఎ. మధుసూదన్ రావు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను, కార్లను ఆపి తనిఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లి తండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.