సమగ్ర హిందూత్వం – నిజమైన సామాజిక న్యాయం

Integral Hinduism – True Social Justiceగత నాలుగు దశాబ్దాల సరళీకరణ విధానాలు కొత్త కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయి. పట్టణ మధ్య తరగతిని పెంచాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక నిపుణులుగా అనేక మంది ప్రవాస భారతీయులు కొలువు తీరారు. అయితే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఇవి కనపడ నీయకుండా చేస్తున్నాయి. దేశంలోని పెద్ద జనాభా అత్యంత వెనుకబడ్డ కులాలకి (ఈబీసీ) సంబంధించిన వారుగా ఉన్నారు. దేశ అభివృద్ధి ఫలాలు వీరికి అందటం లేదు. ఈబీసీల్లో అత్యధికులు గ్రామాల్లో నివసిస్తున్నారు. చివరికి ఎన్నికల విధానాల అంచున నివసిస్తున్నారు. తక్కువ ఆదాయాల్లో నివసిస్తుంటారు. వర్గ అసమానతలు, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అంచనా వేసేందుకు, జనాభా గణాంక వివరాల ప్రాతిపదికన వివిధ కులాలు, మతాల లెక్కలు అధ్యయనం చేయడానికి 1955లో కాకా వేల్కర్‌, 1980లో మండల్‌, 2006లో సచార్‌ కమిషన్‌లను ఆనాటి ప్రభుత్వాలు నిమమించాయి. వాటి అధ్యయనంపై ఆధారపడే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో సామాజికంగా వెనుకబడ్డవారికి ఏ విధంగా రక్షణ కల్పించాలో తేలుతుంది.
ఇటీవల బీహార్‌ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణాంక నివేదిక (2023) జనాభాలో వెనుకబాటుకు గురైన ప్రజలు ఎవరు? దానికి కారణాలేంటి? బీసీల్లో వెనుకబాటుకు కారణాలేంటి? వాటికి పాలనా పరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి వంటి వాటిని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం ఓబీసీ.లు 27.12 శాతం ఉండగా, అత్యంత వెనక బడిన కులాలు (ఈబీసీలు) 36.01 శాతం. మొత్తంగా వెనక బడ్డ కులాలు బీహార్‌ జనాభాలో 63.13 శాతం. దళితులు, ఓబీసీ, ఈబీసీలు తక్కువ ఆదాయాలొచ్చే వ్యవసాయ కార్మి కులుగాను, పట్టణ కార్మికులుగాను బతుకులీడుస్తున్నారు.
అంతకుముందు భూ యజమాన్యాల గురించి చేసిన అధ్యయనంలోనూ సామాజికంగా ధనిక కులాలైన బ్రాహ్మ ణులు, భూమిహారు, రాజ్‌పుత్‌లు బీహార్‌లోని అతి పెద్ద భూ యజమానులుగా ఉండగా, సంఖ్యారీత్యా బలంగా వున్న ఓబీసీ, ఈబీసీలు భూ యాజమాన్యంలోనూ, ఇతర ఆర్థిక సౌకర్యాలలోనూ చాలా బలహీనంగా ఉన్నారని తేలింది.
బీహార్‌ సర్వే అక్కడి ప్రభుత్వం కొన్ని పాలనాపరమైన చర్యలకుపక్రమించేలా చేయడమే కాక జాతీయస్థాయిలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. అధిక ఓబీసీ జనాభా ఉన్న యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో ఇలాంటి సర్వేల కోసం ఆందోళనలు రేగవచ్చు. వాస్తవానికి ఆ రాష్ట్రాల్లో అటువంటి సర్వేలు ఇబీసీల కదలికల్ని వేగవంతం చేసి ఆ రాష్ట్రాల శాసనసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచాలని పెట్టుబడిదారీ వ్యవస్థలో వారి వాటా కోసం డిమాండు ముందుకు రావచ్చు. ప్రస్తుతం నిద్రాణంగా ఉన్న సామాజిక న్యాయం డిమాండును ప్రతిపక్ష పార్టీలు ముందుకు తెచ్చి బీజేపీ ‘హిందూత్వ’ పాలనకు సవాలు విసరొచ్చు. ప్రస్తుతం సామాజిక న్యాయం పేరున జరుగుతున్న రాజకీయాలను అట్టడుగునున్న ఇబీసీలు నిజమైన వారసు లుగా ఉద్యమంతో ముందుకొస్తాయి.
సాంస్కృతిక ఎత్తుగడల ద్వారా, శక్తివంతమైన సోషల్‌ ఇంజనీరింగ్‌ చర్యల ద్వారా మితవాద బీజేపీ గత రెండు దశాబ్దాల్లో ఇబీసీలను బాగా కదిలించగలిగింది. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం వెనుక ఈ ఇబీసీలున్నారు. బీజేపీ అగ్రకులాల రాజకీయ పార్టీ అనే విమర్శను దాంతో అది వదిలించుకుంది. దాంతో సమగ్ర భిందూ (ఇంక్లూజివ్‌ హిందూత్వ) ను వివిధ సాంస్కృతిక చర్యలు సామాజిక ఆచారాలు, ఆయా కులాల్లోని అత్యున్నత నాయకులను ముందుకు నెట్టి అది సాధించగలిగింది.
ముఖ్యంగా యాదవులు మిగిలిన వారి పదవులను కూడా దోచుకుని రాజ్యాన్ని దోచు కుందన్న బీజేపీ విమర్శకు ఇబీసీలు బాగా ఆకర్షితులైనారు. కులాలకతీతంగా బీజేపీ గ్రామీణ పేదలకు, పట్టణ కార్మిక వర్గానికి సాయపడిందనే వాదనకు ఆధారాల్లేవని వివిధ ఈబీసీలకు అదిచ్చిన హామీలు అమ లుకు నోచుకోకపోవడాన్ని బట్టి చూడవచ్చు. ఇబీసీలు ఒక బలమైన సామాజిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవించి సాంప్రదాయక సంస్థలను ప్రజాతంత్రీకరిస్తుందనేది నిజం కాదని బీజేపీ పాలన రుజువు చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత వెను కబడ్డ కులాల సరైన ప్రాతినిధ్యం బీజేపీ పాలనలో రాలేదు. ఒక విషయం స్పష్టం. ఈబీసీీల వంటి వెనకబడ్డ కులాలకు కొద్దిగా నైవేద్యం పెడుతున్న కీలకమైన సంస్థలన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పైపైన సర్వే చేసినా మనకి కన్పడే వాస్తవమేమంటే జ్యుడీషి యరీ, దేశంలోని అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగం, మీడియా, సాంస్కృతిక రంగాలన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి. పేదలు, అత్యంత బలహీన కులాలకు సంబంధించిన బాధ లను పట్టించుకోవడంలో ప్రభుత్వ సంస్థలు వైఫల్యం చెందాయి.
బీహార్‌ కులసర్వే నివేదిక మితవాద శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. దానికి ప్రధాన కారణం అత్యంత వెనుకబడ్డ కులాల్లో ఇది చైతన్యాన్ని రగిలిస్తుంది. రాజ్యం తమకు దక్షిణగా నిలవాలని వారు డిమాండు చేసేలా చే స్తోంది. ఇబీసీలకు సమాన ప్రాతినిధ్యం, వారి దారుణ వర్గ పరిస్థితులు, రాజకీయంగా నాయకత్వ స్థానాల్లో లేకపోవడం, వంటి వాటిని ప్రతిపక్ష పార్టీలు ముందుకు తేవడం ద్వారా బీజేపీ ఇంతకాలం చెప్పుకుంటున్న ‘సమ్మిళిత అభివృద్ధి’ డొల్లతనం బయటపడుతుంది.
నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలన్నీ పట్టణ ధనిక సామాజిక గ్రూపుల వారి ఆధ్వర్యంలో ఉండటం వల్ల దళిత, బహుజన ప్రజలు అట్టడుగుకు నెట్టి వేయబడ్డామనే భావనలో ఉన్నారు. బీహార్‌ సర్వే విడుదల ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల అధికార నిర్మాణాల్లో తమకు మరింత సమానమైన వాటా దక్కాలనే డిమాండు ముందుకొస్తుంది. సామాజికంగా పై నుండే వారు అతి పెద్ద భూ యజమానులుగా ఉండటంతో పాటు సాంప్ర దాయకంగా ఉండే ఫ్యూడల్‌ అధికారాలు, మధ్య తరగతి వారికుండే విశేషాధికారాలు తరతరాలుగా సంక్రమించిన శక్తివంతమైన సామాజిక సంబంధాలు వారికుపయోగ పడ్తున్నాయి. గతం నుండి ఉంటున్న పద్ధతిలోనే వీరు విధానాలను రూపొందించే అధికార వర్గాన్ని, సిఈఓలను, వ్యాపారవేత్తలను, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను వేసేవారిని ఈ నయా ఉదారవాద విధానాలు సృష్టిస్తు న్నాయి. అట్టడుగునున్న ఈ ప్రజా సమూహాలకు ఉప యోగపడే రీతిలో ఉదార విధానాలు నిర్మించిన నిర్మాణాలను ప్రజాస్వామికీకరణ చేసే ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగాయి.
ఆందోళనకరమైన అంశమేమంటే సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులుగా చెప్పుకునే ఆర్‌జేడీ యునైటెడ్‌ బీహార్‌లోనూ, సమాజ్‌వాది పార్టీ యూపీలోనూ పగ్గాలు చేపట్టిన సందర్భాల్లో కూడా బాగా వెనుకబడ్డ ప్రజలకు విధానాల రూపకల్పనలో గాని, ఆర్థికాభివృద్ధిలో గాని, పెద్ద ఉపయోగం కలుగలేదు. సైద్ధాంతికమైన అంశాలపై తప్ప ఈ అట్టడుగు ప్రజలకు సంబంధించిన కీలకాంశాలను ఈ పార్టీలు పట్టించుకున్నది లేదు. నిరంతర ఆధిపత్యంలో ఉన్న సామాజిక వర్గాలను వ్యతిరేకించేందుకు ప్రజల్ని తయారు చేసుకున్నదీ లేదు.
సాధారణంగా రాజకీయ చర్చలో ఈబీసీలను పేద కష్ట జీవులతో కలిపి ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు అందుకునే వారిగా భావిస్తున్నారు. ఇబీసీలు రాజ్యానికి, అంటే ఆధిపత్య కులాల దాతృత్వంపై ఆధారపడే వారిగా మిగలడం ప్రజా స్వామ్య నిర్మాణానికే నష్టం చేస్తుంది. ప్రస్తుతం బీహార్‌, యూపీల్లో ఇబీసీల గొంతులు విడివిడిగా చిన్న కుల సంస్థలుగా చీలి ఉన్నాయి. అణగారిన కులాల సమస్యలు పరిష్కారం చేసే దిశలో అవి లేవు. ఈ దశలో సర్వే నివేదిక ఈ కులాలను స్వతంత్ర రాజకీయ వేదికలుగా మారేలా ఒత్తిడి చేస్తుంది. ఇది హిందూత్వ పునాదులను కదిలిస్తుంది. అంతేకాదు, ఇంతకాలం సామాజిక న్యాయం కోసం పోరాడేవారిగా ఫోజులు పెడ్తున్న వారి అసలు రూపాన్ని బహిర్గతం చేస్తుంది. ఇబీసీల నిజమైన ఆవేదనను అర్థం చేసుకుని వారి సమస్యలకు న్యాయబద్ధమైన పరిష్కారం చూపేలా ఆ సామాజిక న్యాయం కోసం నిలబడ్డామని చెప్పుకునే వారిపై ఒత్తిడి చేస్తుంది. సామాజికంగా ఆధిపత్యంలో ఉన్న వారిపై ఒక ప్రజాస్వామ్యయుతమైన ఉప్పెనను లేవదీస్తుంది. ఆర్‌జేడీ, ఎస్‌పీ, బీఎస్‌పీ, డిఎంకే వంటి పార్టీలు తాము సామాజిక స్యాయం కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఉంటాయి. అవి తమ విశ్వాసాన్ని మరోసారి పునరుద్ఘాటించి వారి మేనిఫెస్టోలో రాజకీయ కార్యకలాపాల్లో ఈబీసీలకు తగు స్థానాన్ని కల్పిస్తాయని ఆశిద్దాం. ఇబీసీల కోసం నిలబడ్తున్న శక్తులతో ఐక్య కార్యచరణకు పైపార్టీలు తగు చొరవ చూపాలి.
‘ఇండియా’ కూటమి ఈ విషయ ప్రాధాన్యతన వెంటనే అర్థం చేసుకుని జాతీయ స్థాయిలో తాము కుల సర్వే చేప డ్తామని ప్రకటించింది. ఇండియా కూటమి ఇబీసీ నాయ కులకు సరైన స్థానాలు కల్పించి కొత్త రాజకీయ నిర్ణయాల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తే ఆర్థిక సాధికారత, సామాజిక న్యాయం అందుకోగల్గుతారు. అటువంటి విశ్వాసపాత్రమైన చర్యలే హిందూత్వ రాజకీయాలను, పెట్టుబడిదారీ అనుకూల ఎజెండాను ధ్వంసం చేయకలదు.
అనువాదం : ఆరెస్బీ
హరీష్‌ ఎస్‌. వాన్‌ఖిడే