నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 27 వరకు ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఆ కాలేజీల జాబితాను పొందుపర్చామని వివరించారు.