జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరణ…

నవతెలంగాణ — భువనగిరి కలెక్టరేట్ 
జూలై 30 31వ తేదీన రామన్నపేట మండల కేంద్రంలో జరిగే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సూరుపంగా ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ లు కోరారు. బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రజా ప్రభుత్వంలో వికలాంగులకు ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు జీఓ ను విడుదల విడుదల చేయాలని  ఈనెల  30,  31న రామన్నపేట పట్టణంలోని జేపీ ఫంక్షన్ హాల్ జరిగే జిల్లా మూడవ మహాసభల జయప్రదం చేయాలని, జిల్లాలోని వికలాంగులు అందరూ హాజరుకావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 300 నుంచి 3000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలులో భాగంగా వికలాంగుల పెన్షన్ 6000 పెంచాలని,  జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ  జిల్లా కన్వీనర్ కొత్త లలిత, పాండాల కే అంజన్,  పి గోపి లు పాల్గొన్నారు.