నవతెలంగాణ నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకట రమణ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రెస్ నోట్లో ప్రకటించారు. ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, దుస్తులు మరెన్నో సౌకర్యాలు గలా గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 2023-24విద్యా సంవత్సరానికి గాను తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వార దరఖాస్తులు, 100రూపాయల ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.