
మండల కేంద్రంలోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో 2025-2026 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీల భర్తీలకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 01-05-2010 నుండి 31-07-2012 తేదీల మధ్యలో జన్మించి ఉండవలెనని ఆమె తెలిపారు.అలాగే 10వ తరగతి చదువుతున్న ఉమ్మడి నిజామాబాద్ విద్యార్థులు 01-06-2008 నుండి 31-07-2010 తేదీల మధ్యలో జన్మించి ఉండవలెను అని ఆమె అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ప్రవేశ పరీక్ష 8 ఫిబ్రవరి 2025న నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు కోసం https://navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె అన్నారు.