నవతెలంగాణ -డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణా ను యువత సద్వినియోగం చేసుకోవాలని అర్ఎస్ఈటిఐ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎసి రిపేరింగ్ 30 రోజులు 25.నుండి ప్రారంభమని, టు వీలర్ మెకానిక్ 30 రోజులు 28నుండి, సీ సీ టీవి రిపేరింగ్ 13 రోజులు 01.సెప్టెంబర్ నుండి ఉంటుందని తెలిపారు.ఉచిత శిక్షణ తో పాటుగా ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పించాడం జరుగుతుందని ఆయన వివరించారు. శిక్షణా అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేస్తమని,శిక్షణకు కావాల్సిన అర్హతలు 19 నుండి 40 ఏళ్ళ వయసు కలిగి ఉండి నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. శిక్షణా కు వచ్చే వారు తమ వేంట ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్, 10 వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు ఫోటోలు తమవేంట తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవలన్నారు.ఏదైనా సమాచారం కోసం ఎస్బిఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్పూర్ రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి నమోదు చేసుకోగలరు. వివరాలకు 08461 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.