ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల  22 శిక్షణ లు  ప్రారంభం కానున్నాయని అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలలకు అందజేసే శిక్షణలు బ్యూటీ పార్లర్ (30 రోజులు),మగ్గం వర్క్ శిక్షణా(30 రోజులు), టైలర్  శిక్షణా (30 రోజులు) ఉంటుందని డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల 19 నుండి 45 ఏళ్ల వయస్సు ఉండి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల  గ్రామీణ ప్రాంత  యువతులు అర్హులన్నారు.శిక్షణ కు వచ్చే వారు తమ వెంట ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డు , రేషన్ కార్డ్ , పదోతరగతి మెమో, ఐదు ఫోటోలు తీసుకొని వచ్చి దరఖాస్తు  చేసుకోవాలని  సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణా సమయం లో  భోజనం, హాస్టల్ వసతి, శిక్షణా పూర్తిగా ఉచితంగా అందచేస్తమని, శిక్షణా అనంతరం ధృవీకరణ పత్రం, టూల్ కిట్ అందచేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిరునామా టి టి డి సి క్యాంపస్, వెలుగు ఆఫీస్ పక్కన డిచ్ పల్లి ఘన్ పుర్ మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్. 08461-295428.