డిగ్రీ మొదటి సంవత్సర ప్రదేశాలకు ఆహ్వానం: ప్రిన్సిపాల్ రోజా

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా కళాశాల, (దమ్మపేట) నందు డిగ్రీ మొదటి సంవత్సర రెండో దఫా  స్పాట్ కౌన్సిలింగ్ కు సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.రోజా గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.ఎంపిసి ఎస్,ఎంపిసి,బి జెడ్ సి,బి ఏ,బి.కామ్ (జి),బీ కామ్  (సి ఎ)  గ్రూపులలో ప్రవేశానికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన ముఖ్యంగా గిరిజన విద్యార్ధినులు అర్హులు అని తెలిపారు.కళాశాలకు తీసుకురావలసిన ఒరిజనల్ ధృవ పత్రాలు: పదో తరగతి,ఇంటర్,ఇంటర్ హాల్ టికెట్,కులం,ఆదాయ,ఆధార్,స్టడీ,ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు కండక్ట్,టి.జి యు.జి సెట్  హాల్ టికెట్,ఐదు పాస్ పోర్ట్ ఫొటోస్ తో కళాశాలకు రావాలని తెలిపారు. ఈ నెల 11 వ తారీఖు నుండి 20 వ తారీఖు వరకు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
గమనిక :- సంప్రదించాల్సిన సమయం ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9381331472.