ముమ్మరంగా కొనసాగుతున్న గృహజ్యోతి జీరో బిల్లుల జారీ

–  జీరో బిల్లుల జారీలో నిమగ్నమైన విద్యుత్ అధికారులు,సిబ్బంది
– హర్షం వ్యక్తం చేస్తున్న విద్యుత్ వినియోగదారులు
– జీరో బిల్లు రాని వారు మరల దరఖాస్తు చేసుకోవాలి
– అర్హత కలిగిన ప్రతియొక్క వినియోగదారునికి జీరో బిల్లులు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండలో విద్యుత్తు వినియోగదారులు అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం (వాడకం) వినియోగించుకున్న వినియోగదారులకు శుక్రవారం నాడు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జీరో బిల్లులను ఇవ్వడం జరిగింది. అనంతరం విద్యుత్ అధికారులు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి గృహజ్యోతి జీరో బిల్లు రానివారు ఎలాంటి ఇబ్బందుల గురికాకుండా  నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పోర్టల్ రెండు, మూడు రోజుల్లో అందుబాటులో రానున్నదని, అధైర్య పడకుండా మీ యొక్క ఇంటి సర్వీస్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు మరొక సారి నమోదు చేయించుకున్న అనంతరం స్లిప్ తీసుకుని విద్యుత్ కార్యాలయానికి వస్తే అప్లోడ్ చేస్తామని అన్నారు. ప్రతి వినియోగదారుడు కి జీరో బిల్ వస్తున్నదని, అర్హులైన వినియోగదారులు అందరూ విద్యుత్ సంస్థకు సహకరించగలరని కోరుతూ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యుత్ అధికారులు తెలియజేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి విద్యుత్ అధికారులు, సిబ్బంది జీరో బిల్లుల జారీలో నిమగ్నమయ్యారు. జీరో బిల్లులు పొందడం పై హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్న విద్యుత్ వినియోగదారులు, ప్రజలు.