హీరో ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ-రిలీజ్ చేయనున్నారు. ఈనెల 23న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది’ అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్నింటినీ ట్రైలర్లో పొందు పర్చారు. ఈ మూవీని జయంత్ సీ పరాన్జీ తెరకెక్కించారు. కె.అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని లక్ష్మీ నరసింహా మూవీస్ సంస్థ రీ- రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకులు, ఆయా హీరోల అభిమానులు రీ-రిలీజ్లను ఓ పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేని కూడా ‘ఈశ్వర్’ రీ-రిలీజ్తో గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకునేందుకు ఆయన ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే ప్రభాస్కి ఇప్పుడు పెరిగిన ఫాలోయింగ్, ఫాలోవర్లకు తగ్గట్టుగా ‘ఈశ్వర్’ను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్ మేనియాను డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈశ్వర్ 4కే సెలెబ్రేట్ చేసుకోబోతోన్నారు అని లక్ష్మీ నరసింహా మూవీస్ అధినేత తెలిపారు.