
నవతెలంగాణ – మల్హార్ రావు
మండలంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశార., ఈ కార్యక్రమాలు మొత్తం దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగాయాని, కస్తూర్భా ఆశ్రమ పాఠశాలలో జరిగిన కార్యక్రమం మొత్తం విద్యుత్ వెలుగులతో జరిగిందని ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని భూపాలపల్లి విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్చూరు నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు 33 కె వి లైన్ లో ఎర్త్ సమస్య తలెత్తడంతో 4 నిమిషాలలోనే సరఫరాను పునరుద్దరించామని ఆయన అన్నారు. పని కట్టుకొని కొందరు విద్యుత్ శాఖ పై లేనిపోని నిందారోపణలు చేయడం సమంజసం కాదని, విద్యుత్ శాఖ సిబ్బంది ఆహర్నిశలు శ్రమించి లైన్ ల నిర్వహణ , బ్రేక్ డౌన్స్ , ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు , ట్రిప్పింగ్స్ ను తగ్గించడం వలన రాష్ట్రంలోనే అత్యదిక పీక్ డిమాండ్ 15623 మెగావాట్ల చేరుకోవడం జరిగిందని తెలిపారు. కావాలని విద్యుత్ శాఖ పై బురద చల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు . అంతరాయాలు లేకుండా వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. కాబట్టే అంత డిమాండ్ నమోదు కావడం రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి అన్నారు . అధికారిక కరెంట్ కోతలు లేవని , విద్యుత్ శాఖ పై దుష్ప్రచారం చేయడం సరైనది కాదని తెలిపారు . రేయింబవళ్లు విద్యుత్ శాఖ సిబ్బంది కష్టపడి విద్యుత్ వెలుగులు అందిస్తున్నారని ఇందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
|