రజనీకాంత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్’. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్గా విడుదల చేశాయి. గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్మీట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘జైలర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ కలసి మేం విడుదల చేశాం. ప్రేక్షకులు, మీడియా, ఇండిస్టీ అన్ని వైపుల నుంచి రజనీకాంత్కి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కిందని చెబుతున్నారు. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రలో చాలా సెంటర్స్లో మాట్నీ నుంచి అదనంగా థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి యునానిమస్గా బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము మొదటిసారి కలిసి విడుదల చేయడం, ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘ఈ చిత్ర రైట్స్ని ఇచ్చిన సన్ పిక్చర్స్, కళానిధి మారన్కి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్. సన్ పిక్చర్స్తో భవిష్యత్తులోనూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు’ అని మరో నిర్మాత సునీల్ నారంగ్ చెప్పారు.