– మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి, తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి కీలకపాత్ర పోషించారని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. ఎస్. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని స్ఫూర్తి స్థల్లో పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఆకాక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. జైపాల్ రెడ్డి పేరు మీద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చిందంటే జైపాల్ రెడ్డి కృషి ఫలితమే అని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయన ఉత్తమ లోక్సభ సభ్యుడిగా పేరుపొందారన్నారు. ఆయన లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసి పార్లమెంట్లో బిల్లును పాస్ ఘనత ఆయనది అన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ జైపాల్ రెడ్డి స్టూడెంట్ లీడర్ నుంచి అంచలంచలుగా ఎదిగారన్నారు.