పట్టణ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం

నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజా ఐక్య వేదిక సర్వసమాజ్ అధ్వర్యంలో ఆర్మూర్ లోని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహించామని, గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆ గ్రామ దేవతలను మొక్కుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదర్లు జాగీర్దార్ శ్రీను, గోజూరు శ్రీను, సర్వ సమాజ్ ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, ఉపాధ్యక్షులు, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు,సర్వసమాజ్ సభ్యులు, సదరులు తదితరులు పాల్గొన్నారు