గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్ఎల్సితో కలిసి రాధాకష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ‘జాతర’ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ను నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసి, చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో’ అంటూ దండోరా న్నట్టుగా మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ‘నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావారా?’, ‘తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకుని బతికే వాళ్లం కాదు’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి. టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉంది. విజువల్స్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ షాట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో ఈ చిత్రం రాబోతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో దీయా రాజ్ కథానాయిక.