జితేందర్‌రెడ్డి రిలీజ్‌కి రెడీ

జితేందర్‌రెడ్డి రిలీజ్‌కి రెడీముదుగంటి క్రియేషన్స్‌ పై విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. రాకేష్‌ వర్రె లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమా 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్‌, రియా సుమన్‌, చత్రపతి శేఖర్‌, సుబ్బరాజు, రవి ప్రకాష్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, గ్లిమ్స్‌, టీజర్‌ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకిత భావం ఉన్న జితేందర్‌ రెడ్డి సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్‌ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్‌లో లీడర్‌గా ఎదిగి,
ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దౌర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్‌ మధ్యలో హిందుత్వం వంటి డైలాగ్‌లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980ల్లో ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్‌, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. ఈనెల10న ‘జితేందర్‌ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ ద్వారా తెలిపారు.
లవ్‌ స్టోరీస్‌ డైరెక్ట్‌ చేసిన విరించి వర్మ ఇలాంటి ఒక యాక్షన్‌ సినిమా చేశారా అంటే అస్సలు నమ్మేలా లేదు అని మేకర్స్‌ తెలిపారు.రియా సుమన్‌, వైశాలి రాజ్‌, ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజు, రవి ప్రకాష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్‌ : విరించి వర్మ, నిర్మాత : ముదుగంటి రవీందర్‌ రెడ్డి, కో- ప్రొడ్యూసర్‌ : ఉమ రవీందర్‌.