మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో ప్రగతిభవన్‌లో మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాల ప్రముఖులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నేత అన్నాబావు సాఠే మనవడు సచిన్‌ సాఠే, మాజీ జెడ్పీ సభ్యులు వైంటీ వైభవ్‌ కదం, ప్రమోద్‌ విఠల్‌ జాదవ్‌, సిర్వాల్‌ సతారా, మేనేష్‌ రాహుల్‌ గాడ్సే, అజర్‌ ఖాన్‌ (మాజీ ఇండియన్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌), వభూ వసంతరావు కదం (ఇండియన్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, రీజినల్‌ కార్యదర్శి) శ్రీనివాస్‌ ఇస్తారి ఎలిగేటి (మాజీ కార్పొరేటర్‌ భివండి) తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ చైర్మెన్‌ రవీందర్‌ సింగ్‌, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు మాణిక్‌ కదమ్‌, శంకరన్న డోంగే, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి పాల్గొన్నారు.