ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా అని కవి సంధ్య సంపాదకుడు ఆచార్య శిఖామణి అన్నారు. సమతా సాహితి వేదిక ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా 120వ జయంతి వేడుకలు సంస్థ అధ్యక్షురాలు కాకుమాను శశి శ్రీ అధ్యక్షతన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య శిఖామణి పాల్గొని గుఱ్ఱం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనాల కోసం అనేక రచనలు చేశారని పేర్కొన్నారు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందు వల్ల అనేక అవమానాలు ఎదుర్కొన్నాడని తెలిపారు. దళితుల చైతన్య చైతన్యం కోసం అనేక కవితలు రాశారని తెలిపారు.