మందకృష్ణ మాదిగను సన్మానించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.. 

నవతెలంగాణ – జుక్కల్
సమాజిక ఉద్యమ నేత శ్రీ మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాదిగ ప్రజా ప్రతినిధుల బృందంతో కలిసి మంగళవారం నాడు శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మందకృష్ణ మాదిగకి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం సార్ పాల్గొన్నారు..