
– శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధిహామీ కూలీలకు పని దినాలు పెంపు, రోజువారి కూలి వేతనం రూ.400 అమలు చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంథని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బైక్ ర్యాలీల నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు 200 పని దినాలు పెంపుతోపాటు, రోజుకు కూలి రూ.400 పెంపు చేస్తామన్నారు.పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు.ఎన్నికల కోడ్ తరువాత రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందన్నారు.-శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పండించిన పంటకు కనీస మద్దతు ధర, వరికి రూ.500 బోనస్, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా రూ.లక్ష , ఆరోగ్య బీమా రూ.25 లక్షలు, యువతకు రూ.30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.