రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు కలిగోట్ క్రీడాకారిణిలు

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలం లోని కలిగోట్ గ్రామానికి చెందిన ఎన్ పూజ అండర్ 17 పి ప్రవళిక అండర్ 14 రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమాచారి  తెలిపారు. ఈనెల 23 నుండి 25 వరకు వరంగల్ జిల్లా తొర్రూర్ లో జరిగే బీచ్ వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ పూజ, పి ప్రవళికను  సర్పంచ్ చేతన విజయ రెడ్డి  ఉప సర్పంచ్ నాయిక రాజు ఎంపీటీసీ జయ గిరిధర్ గౌడ్  ఎస్ఎంసి చైర్మన్ సత్యనారాయణ  గ్రామ కమిటీ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.