ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 ఎడి’ విడుదల తేదీని మేకర్స్ గ్రాండ్గా అనౌన్స్ చేశారు. వారణాసి, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, మదురై, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, విజయవాడ, కాశ్మీర్తో సహా ఇండియాలోని పలు నగరాల్లో రైడర్ల ద్వారా గ్రాండ్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయటం విశేషం. ఈ సందర్భంగా రైడర్లు కవాతు చేసి మరింత ఎగ్జైట్మెంట్ని పెంచారు. అద్భుతమైన రీతిలో ఈ చిత్ర విడుదల తేదీని మే 9గా అనౌన్స్ చేశారు. వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులు, నిర్మాత సి.అశ్విని దత్ విడుదల తేదీ గురించి తెలియజేస్తూ, ‘వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సినిమా ప్రయాణంలో మే 9కి ఉన్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నుండి అవార్డులు గెలుచుకున్న ‘మహానటి’, ‘మహర్షి’ వరకు ఈ తేదీ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు కలిసి నటిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ విడుదల ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. బ్యానర్ మైలురాయి 50వ సంవత్సరానికి అనుగుణంగా, వైజయంతీ మూవీస్ ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా చేస్తుంది’ అని అన్నారు
గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్లో టీజర్ గ్లింప్స్ విడుదలై సంచలనం సష్టించింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ప్రేక్షకులకు దశ్యకావ్యాన్ని అందించబోతుంది.