ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్లో రూపొందుతున్న ప్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఎడి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించబోతుంది. తాజాగా చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు యూనిట్ అంతా కలిసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్లో ఈ పాటని చాలా గ్రాండియర్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమా గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్లో సంచలనం సష్టించింది. టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందింది. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మైథాలజీ ఇన్స్పైర్డ్ ప్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దశ్యకావ్యాన్ని అందించబోతుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కానుంది.