కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’

– నిన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీలపై రేవంత్‌ ట్వీట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలు రాయి. నిన్న మేడిగడ్డ, నేడు అన్నారం. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు. ప్రాజెక్టు అంటే నీ ఫామ్‌ హౌస్‌కు ప్రహరీ గోడనుకున్నావో. నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో. రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగు కోట్ల జనం నోట్లో మట్టి గొట్టావు. వందేండ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం. మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు రూ. లక్ష కోట్ల అవినీతి’ అని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.