నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో తెల్ల పెద్ద జొన్న పంటకు కంకి పురుగుల బెడదతో పంట నష్టం జర్గుతొందని మండలంలోని పలు గ్రామాల రైతు తెలిపారు. ఈ సంధర్భంగాల పడంపల్లి గ్రామ రైతు సూర్యకాంత్ మాట్లాడుతు తెల్ల జొన్న పంట మంచిగా ఎపుగా పెర్గిందని, దిగుబడి బాగుంటుందని ఆశించివామని, ప్రకృతి ధర్మానుసారం పంటకు కంకి రావుతాగే దశలో ఉన్నప్పుడే కంకిలోపల పురుగుల బెడదతో కంకి ఎంజిపోందని, పురుగులు కంకులకు కత్తిరించి వేయడం వలన భారీగా పంటనష్టంతో పాటు గిగుబడి తగ్గుతుందని ఆవేదవ వ్యక్తం చేసారు. ఇప్పడికి ఎన్నో రకాల రసాయన మందులను పిచకారీ చేసామని, బెడద తగ్గడం లేదని, వ్వవసాయాదికారులు ఇటివలే క్షేత్రస్థాయిలో పరీశీలించడం జర్గందని, వారి సూచనస మేరకు మందులను పంటకు స్ప్రే చేసామని వారు పేర్కోన్నారు.