
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం కరీంనగర్ జడ్జి శ్రీ వాణి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకొని, రాజన్న సేవలో తరించారు.అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు.ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,ఆలయ ఇన్స్పెక్టర్ సంకపల్లి పవన్, పోసాని రాజు తోపాటు తదితరులు ఉన్నారు .