కావేరి సీడ్స్‌ రెవెన్యూ రూ.808 కోట్లు

న్యూఢిల్లీ: ప్రముఖ విత్తన కంపెనీకావేరి సీడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 5.32 శాతం వృద్థితో రూ.808.08 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. ఇదే సమయంలో సంస్థ నికర లాభాలు 5.63 శాతం పెరిగి రూ.282.91 కోట్లుగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 267.84 కోట్ల లాభాలు ఆర్జించింది.