రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన మహనీయుడు కేసీఆర్..

నవతెలంగాణ-తొగుట
రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి,తెలం గాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ అభినందనియమని సర్పంచ్ సిరి నేని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నా రు.2009 నవంబర్ 29 చావు నోట్లో తల పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చెప్పట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి తెలంగాణ ప్రకటన చేసే విదం గా ప్రతిన బునాడని అన్నారు.రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అభివృద్దే లక్షంగా నిరంతరం కృషి చేశా రన్నారు.నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల ని దృఢ సంకల్పంతో అన్ని వర్గాలను సంక్షేమం ద్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగించారని అభి ప్రాయం వ్యక్తం చేశారు.ఎడారిని తలపించేలా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాజెక్టులను నిర్మాణం చేస్తూ అన్ని జిల్లాలకు సాగునీరు,తాగునీరు అందే విదం గా ప్రణాళికలు సిద్ధం చేశారని హర్షం వ్యక్తం చేశా రు. ఉమ్మడి మెదక్ జిల్లా లో గతంలో తాగునీటి కోసం మహిళలు కాళీ బిందెలతో యెన్నో సార్లు రోడ్లపై ధర్నాలు చేసిన సందర్భలు ఉన్నాయని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నేడుతాగునీటి కోసం ఏ ఒక్క మహిళ అగుపడడం లేదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్విరా మంగా కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఓటమి పాలవడం బాధాకరమన్నారు.పరుగులు పెట్టించిన అభివృద్ధికి సంకెళ్లు వేసిన ప్రజలకు భవిష్యత్తులో ఏమి జరిగేది మునిముందు తెలుస్తుందని అన్నారు.