రక్తహీనత లోపాలను తగ్గించేందుకు కేసీఆర్ కిట్

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
మహిళల్లో రక్తహీనత పోషక ఆహార లోపాలను తగ్గించేందుకు కేసీఆర్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలో 15 మందికి గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్ రెడ్డి, కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి, గర్భిణీ స్త్రీలు ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.