మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కాంక్షకు అనుగుణంగా కేసిఆర్ పాలన

– రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
– గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి
నవతెలంగాణ కమ్మర్ పల్లి
మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కాంక్షకు అనుగుణంగా కేసిఆర్ పాలన సాగుతోందని.. మహాత్ముడి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్  పల్లెలను పరిపుష్టం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.సోమవారం వేల్పూర్ మండల కేంద్రంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం చేసిన అలుపెరగని పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చిందన్నారు. అహింసా మార్గంలో దేన్నైనా జయించవచ్చని నిరూపించిన గాంధేయ మార్గంలోనే కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కాంక్షకు అనుగుణంగా తెలంగాణలో కేసిఆర్ పాలన సాగుతోందని, మహాత్ముడి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పల్లెలను ఆర్దికంగా పరిపుష్టం చేస్తున్నారని అన్నారు.  గాంధీజీ సేవలు సదా స్మరనీయమని మహాత్మునికి మంత్రి వేముల జోహార్లు తెలిపారు.మంత్రి వెంట డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, రైతు  నాయకుడు కోటపాటి నరసింహా నాయుడు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.