నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక నేతలను అరెస్టు చేసింది. మరికొందరిని సమన్లు జారీ చేసి విచారించింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇప్పటివరకు ఈడీ ఐదుసార్లు సమన్లు ఇవ్వగా ఆయన ఒక్కసారి కూడా విచారణకు వెళ్లలేదు. తనను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ పదేపదే నోటీసులు ఇస్తోందని ఓవైపు కేజ్రీవాల్, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ‘ఈ రోజు కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. మేం చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటాం.