కోదండ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారంతండా లో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ కోదండ రామచంద్ర స్వామిదేవస్థానం నిర్మాణానికి తిప్పారం గ్రామానికిచెందిన బంగారువాడి గంగారాం తండ్రి కిషన్ రావు తిప్పారం ఆదివారం నాడు తిప్పారం తాండ గ్రామపంచాయతి పరిధిలోని శ్రీశ్రీశ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవస్థానం నిర్మాణానికి తన వంతు కృషి సహకరం గా (50111/-) యాభై వెయిల నూట పదకొండు రూపాయలు విరాళంను గ్రామ సర్పంచ్ సుందరి బాయి బిషన్ నాయక్ మరియుఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈకార్యక్రమం లో తండాసర్పంచ్ సుందరిబాయి బిషన్ నాయక్,ఉపసర్పంచ్ గంగారాం, పెంటయ్య ,ఆలయ కమిటీ సభ్యులు తండావసూలు తదితరులు పాల్గొన్నారు.