కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను కలిసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ అసెంబ్లీ టికెట్‌ తనకి కేటాయించిన సందర్బంగా శనివారం సి ఎల్‌ పి నేత కుందూరు జానారెడ్డి, నల్గొండ పార్లమెంట్‌ సభ్యులు నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కసిరెడ్డి నారాయణ రెడ్డి లను వారి నివాసాలకి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కలిశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.