ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్ష ఉత్తరాల పోస్టు..

Lakh letters post to Chief Minister Revanth Reddy..నవతెలంగాణ – ఆర్మూర్ 
ధర్మ సమాజ్ పార్టీ, తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన కొరకు నియోజకవర్గ ఇంచార్జి ప్రేమ్ మహరాజ్  ఆద్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన ఉత్తరాన్ని పోస్టు చేస్తున్నట్లు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అంబెడ్కర్ చౌరస్తా వద్ద  మాట్లాడుతూ.. భారతదేశ సమస్తాన్ని అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత రాజ్యాంగం అందరికీ తెలిసిన విషయమే అని, అందుకని భారత గణతంత్ర దినోత్సవం – భారత రాజ్యాంగ అమలు దినం ఐన రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, దాని రూపశిల్పి డా. అంబేడ్కర్ చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించేలాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని డిమాండ్ లేఖను రాస్తున్నామన్నారు. త్వరగా అమలు నిర్ణయాన్ని జీవో ద్వారా తీసుకుంటారనీ ఆశిస్తున్నామన్నారు. నేడు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  వారు తెలిపారు ఈ కార్యక్రమనికి పౌరులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేష్, రంజిత్, నాయకులు నవీన్ ,జైయచంద్ర రాజు ,షేక్ ఆర్షద్, లు  తదితరులు పాల్గొన్నారు.