లాల్‌ ”కేరళీయం సెల్ఫీ” వైరల్‌

Lol "Keraliyam Selfie" is viralతిరువనంతపురం : వచ్చే ఏడాది జరగనున్న కేరళీయం ఈవెంట్‌ ప్రచారంలో భాగంగా కేరళ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రముఖ నటులు కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, శోభనలతో మోహన్‌ లాల్‌ సెల్ఫీ వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మలయాళ అభిమాన నటుడు మోహన్‌లాల్‌ మాట్లాడుతూ… ‘వచ్చే ఏడాది జరగనున్న ‘కేరళీయం’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగుదాం’ అన్నారు. మలయాళీ అయినందుకు గర్వపడుతు న్నాననీ, ఇది తన నగరం అని మోహన్‌లాల్‌ చెప్పారు. తిరువనంతపురం అంత సుపరిచితమైన నగరం లేదు. ఇక్కడి ప్రతి సందు, క్రేనీ తెలుసు. కేరళ కోసం ఈ నగరాన్ని ఎంచు కున్నందుకు ఆనందంగా ఉంది. తాను కేరళలో పుట్టినందుకు, మలయాళీ అయినందుకు గర్విస్తున్నా అని మోహన్‌లాల్‌ అన్నారు. మమ్ముట్టి మాట్లాడుతూ… ప్రేమ, సామరస్య ప్రపంచానికి కేరళ నమూనా అని వివరించారు. తన వద్ద లిఖితపూర్వక ప్రసంగం లేదంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మమ్ముట్టి… కేరళ అనేది కేరళీయుల భావన మాత్రమే కాదని, అది యావత్‌ ప్రపంచానికి చెందాలని చెప్పారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. ప్రేమ, సామరస్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలనీ, మనల్ని చూసి నేర్చుకునే ప్రపంచానికి మనం ఒక్కటే అని పిలవాలని అన్నారు. కాగా, లాల్‌ ”కేరళీయం సెల్ఫీ” కొద్దిసేపటికే సోషల్‌మీడియా ప్రసార మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ కేరళ మేళాలో చిత్రీకరించిన ఈ చిత్రం సినీ ప్రేమికులకు అరుదైన దృశ్యాన్ని అందించింది. మోహన్‌లాల్‌ తీసుకున్న సెల్ఫీలో మమ్ముట్టి, కమల్‌ హాసన్‌, శోభన, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మంత్రులు వి శివన్‌కుట్టి, కె రాజన్‌, రోషి అగస్టిన్‌, స్పీకర్‌ ఎఎన్‌ శంసీర్‌ తదితరులు ఉన్నారు.