చివరి 20 నిమిషాలు

Last 20 minutesసజన్‌ కుమార్‌ బొజ్జంతో కలిసి లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్‌’. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. ఈనెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ, ‘రొమాన్స్‌, ఎంటర్‌ టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. మా సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి తీసుకున్నారు. ఈటీవీ విన్‌ మా సినిమా డిజిటల్‌ రైట్స్‌ కొనుగోలు చేసి మాకు ధైర్యానిచ్చారు. ఈ మధ్య కాలంలో విడుదలకి ముందే ఓ చిన్న సినిమా అన్ని హక్కులు సేల్‌ అవ్వడం రికార్డే అని చెప్పాలి. ఈ నెల 21న ప్రీమియర్స్‌ వేస్తున్నాం’ అని అన్నారు. ‘ఇదొక సరికొత్త యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఎమోషనల్‌ రైడ్‌. సినిమాలో లాస్ట్‌ 20 నిమిషాలు అందరి హదయాలను హత్తుకుంటుంది’ అని దర్శకుడు విక్రమ్‌రెడ్డి తెలిపారు.