సరికొత్త కథ, కథనాలు..

సరికొత్త కథ, కథనాలు..అరుణ్‌ ఆదిత్య, అప్సర రాణి జంటగా వినూత్న సెల్యూలాయిడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై కష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సమర్పణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్‌ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, రైటర్‌ పరుచూరి గోపాలకష్ణ హీరోయిన్‌పై క్లాప్‌ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కష్ణబాబు మాట్లాడుతూ. ‘ఏప్రిల్‌ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్‌ చేస్తాం. సబ్జెక్టు బాగా వచ్చింది. అరుణ్‌ ఆదిత్య – అప్సర రాణి జంటగా చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేస్తాం’ అని తెలిపారు. అప్సరరాణి మాట్లాడుతూ, ‘మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్‌ అవుతుందన్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెెంకటేష్‌ మాట్లాడుతూ, ‘ఒక టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్‌గా సిద్ధం చేశారు. హీరో అరుణ్‌ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్‌ అప్సర రాణి కూడా నిబద్దతతో, అంకితభావంతో పని చేసే వ్యక్తి. ఆమె డెడికేషన్‌ ఈ సినిమాకు ఎంతో హెల్ప్‌ అవుతుంది’ అని తెలిపారు.