జనం పక్షాన నిలిచే వారిని గెలిపించండి

– తారానగర్‌లో బృందా కరత్‌
– రాజస్థాన్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి. జనం పక్షాన నిలిచే అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ కోరారు.రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. చురు జిల్లాలోని తారానగర్‌ లో విజయవంతమైన బీమా క్లెయిమ్‌ కిసాన్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిర్మల్‌ కుమార్‌కు మద్దతుగా బృందా కరత్‌ ప్రచారం చేశారు. వివిధ సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. నిర్మల్‌ కుమార్‌కు లభిస్తున్న బలమైన మద్దతును తగ్గించడానికి ఈ నియోజకవర్గంలో భారీగా డబ్బు ఖర్చు చేస్తూ ప్రయివేట్‌ బీమా కంపెనీ అనుకూల, కులతత్వ శక్తులు ముఠాగా ఉన్నాయని విమర్శించారు. బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.