డెంగ్యూ సోకినపుడు విపరీతమైన జ్వరం ఉంటుంది. అంతే కాదు భరించలేనంత తలనొప్పి, కళ్ళల్లో మంట, కనురెప్పల చుట్టూ నొప్పి, ఒళ్ళు నొప్పులు, మంటతో కూడిన కీళ్ల నొప్పులు, అనారోగ్యానికి గురైన కొద్ది రోజుల్లో దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలా చేద్దాం…
వర్షాకాలం వచ్చే వ్యాధుల్లో ప్రధానమైన వాటిల్లో డెంగ్యూ ఒకటి. ఇది సాధారణంగా 8-10 రోజుల పాటు వేధించే వ్యాధి. ఏడిస్ జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యంగా వుంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి దారి తీస్తుంది.
వ్యాధి లక్షణాలు
డెంగ్యూ సోకినపుడు విపరీతమైన జ్వరం ఉంటుంది. అంతే కాదు నిరంతరం తలనొప్పి, కళ్ళల్లో నొప్పి, కను రెప్పల చుట్టూ నొప్పి, ఒళ్ళు నొప్పులు, మంటతో కూడిన కీళ్ల నొప్పులు, అనారోగ్యానికి గురైన కొద్ది రోజులలో దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే విపరీతంగా వాంతులు, చిగుళ్లలో రక్తస్రావం, కడుపునొప్పి విపరీత మైన అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఇలా జాగ్రత్తపడాలి..
సాధారణంగా దోమలన్నీ ఎక్కువగా చీకటి పడ్డ తర్వాత విజృంభిస్తాయి. కానీ డెంగ్యూ వ్యాధిని కలిగించే ఏడిస్ దోమలు పగటిపూట కుడతాయి. ఇవి మురుగు నీటిలో పెరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రాత్రి పూట నీటి ఉపరితలంపై గుడ్లను పెడుతుంటాయి. డెంగ్యూ వైరస్ సోకిన రోగిని కుట్టిన తర్వాత దోమ ఆ వైరస్ను తీసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి దోమల నుంచి శరీరాన్ని కాపాడుకోవాలని, ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.